డీవోపీటీ కార్యదర్శికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ

డీవోపీటీ కార్యదర్శికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులపై అభిశంసన ప్రొసీడింగ్స్‌పై సీఎస్‌ లేఖ రాశారు. ఏపీ ఎస్ఈసీ తీసుకున్న చర్యలు తీవ్ర అభ్యంతరకరమని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర పరిధిలోని అధికారులపై ఎస్‌ఈసీకి చర్యలు తీసుకునే అధికారం లేదన్నారు. రూల్ నెం.10 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అభిశంసన ఉత్తర్వులు ఉంటాయన్నారు. తన పరిధిలో లేని న్యాయ, చట్ట విరుద్ధమైన ఉత్తర్వులను ఐఏఎస్ అధికారులపై ఏపీ ఎన్నికల కమిషనర్ తీసుకున్నారని ఏపీ సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు తీసుకోవటం న్యాయ విరుద్ధమన్నారు. అభిశంసన ఉత్తర్వులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఎస్‌ఈసీ పంపిన అభిశంసన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దని సూచించారు. ఎస్‌ఈసీకి సూచనలు, మార్గదర్శనం చేయాలని డీవోపీటీని కోరారు.