ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా సమస్యను పరిష్కరించాలి: రామకృష్ణ

సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సాగునీటి వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి సరికాదని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు.. భేటీ అయి సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు కేసీఆర్​.. రాజకీయంగా, వ్యక్తిగతంగా సహకరించుకుంటూ.. విందులు చేసుకుంటూ ప్రజా సమస్యల విషయంలో మాత్రం వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అలా కాకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు జల వివాదాలకు తావిస్తూ.. అపెక్స్​ కౌన్సిల్​కు వెళ్లారని విమర్శించారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలకు మంచిదని మంచిదని సూచించారు.