దళితుల భూములు వారికే చెందాలి: జనసేన డిమాండ్

సత్యవేడు నియోజకవర్గం: బి.ఎన్.కండ్రిగ మండల తహసీల్దార్ ని గురువారం జనసేన జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్య కుమార్, మండల అధ్యక్షుడు బాషా కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుక్కంబాకం గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్ 81లో భూమిని దళిత రైతులు గత 20 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్నారు. గత సంవత్సరం రైతు సత్యమూర్తి దగ్గర లక్ష రూపాయలు వైసీపీ మండల అధ్యక్షుడు విద్యనాథ రెడ్డి తీసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అంతే కాక రైతులను పొలంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నందున సత్యమూర్తి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. ఈ సంఘటనపై తహసీల్దార్ ని కలసి దళితులు సాగుచేసుకుంటున్న భూమి వారికే చెందాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళి, కృష్ణా, బాలాజీ, శరత్, భాస్కర్, ఢిల్లీబాబు, హరి తదితరులు పాల్గొన్నారు.