రోడ్డు సమస్యను పరిష్కరించాలని కొత్తగూడెం జనసేన నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం, పాల్వంచ మండలం పాల్వంచ నుంచి పాండురంగపురం పోయే ప్రధాన రహదారి అత్యంత దారుణంగా ఏర్పడి ఎన్నో ప్రమాదాలను చోటు చేసుకుంటున్నాయని అత్యవసర పరిస్థితులలో గర్భిణీలు హాస్పిటల్ కి వెళ్ళాలి అన్నా గాని అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితులు లేవని ఇటు కేటీపిఎస్ యాజమాన్యం, మున్సిపాలిటీ వాళ్లు కూడా ఇది మీదంటే మీది అనుకుంటూ ఈ రోడ్డుని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అధికార పార్టీ శిలాఫలకాలకే పరిమితం అవుతుంది తప్ప ఇటువంటి రోడ్లు పట్టించుకునే పరిస్థితి లేదని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ రోడ్డు సమస్యను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని జనసేన పార్టీ కొత్తగూడెం ఇంచార్జ్ వేముల కార్తీక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పాల్వంచ మండల అధ్యక్షులు ఓలపల్లి రాంబాబు, ఉపాధ్యక్షులు గజ్జల సంపత్ రామ్ వర్మ, పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల వీర బ్రహ్మం, ప్రధాన కార్యదర్శి దేవా గౌడ్, టౌన్ సెక్రెటరీ శివ, భాస్కర్, వేణు, పవన్, మల్లికార్జున్, సాయి శిశు, మధు, అశోక్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.