బత్తుల సేవలకు సన్మానించిన ఓం శాంతి ఆశ్రమం

రాజానగరం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో ఓం శాంతి ఆశ్రమం 9వ వార్షికోత్సవము డా.తోటకూర సత్యనారాయణ, గురుమాత పరమేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన 9 వ వార్షికోత్సవ ఉత్సవంలో ముఖ్య అతిధిగా రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వార్షికోత్సవంలో పాల్గొన్న బత్తుల బలరామకృష్ణని ఓం శాంతి ఆశ్రమ కమిటీ వారు ప్రత్యేక సన్మానం చేసి ఆయన చేస్తున్న సేవలు సమాజం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, ఆప్యాయత, దయ, కరుణతో చేస్తున్న ప్రజాసేవ భవిష్యత్ లో మరింత సేవలు విస్తరించాలని, ఉన్నత పదవులు అధిష్టించాలని, ఎల్లపుడూ దేవుడి దయ, ఆశీర్వాదము ఆయనకు ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపాక సత్తిబాబు, మట్టా వెంకటేశ్వరరావు, మదిరెడ్డి బాబులు, కొండేటి సత్యనారాయణ, చీకట్ల వీర్రాజు, దాసర రమేష్, బాపినీడి సుబ్బారావు, రుద్రం నాగు, ఆలపాటి ఎల్లారి కుమార్, ఇనుగంటివారిపేట బ్రహ్మం, సుబ్రమణ్యం, తన్నీరు సురేష్, కొండేటి సత్య, మావుడాల సుబ్రహ్మణ్యం, ఒనుము వెంకటలక్ష్మి, ఇతర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.