గొర్ల కృష్ణకు మనోధైర్యాన్నిచ్చిన అంకారెడ్డి రాజా శేషు

తుని నియోజకవర్గం, టి.వెంకటాపురం గ్రామానికి చెందిన జనసైనికుడు గొర్ల కృష్ణకి హ్యాండ్ ఫ్రాక్చర్ కి గురైన కారణంగా తుని నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంకారెడ్డి రాజా శేషు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గొర్ల కృష్ణ సోదరులు వారి ఆర్థిక పరిస్థితి వివరించగా వాళ్ల పరిస్థితి విని పెద్దమనసు చేసుకొని తుని నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంకారెడ్డి రాజా శేషు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. టి. వెంకటాపురం గ్రామ జనసైనికులు అందరూ, తుని నియోజకవర్గంలో మీ లాంటి భరోసా ఇచ్చే నాయకులు జనసేన పార్టీలో ఉండడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అని రాజా శేషుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు రాజు బాబు, ఆల్లవరపు సురేష్, నాళం రమేష్, శివ, తేటగుంట నానాజీ, గుర్రం శ్రీను, వీరమహిళ సత్యవతి, ప్రసాద్, టి.వెంకటాపురం జనసైనికులు కూడా కృష్ణను పరామర్శించి ధైర్యం చెప్పారు.