పరిజల్లిపేట ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి

రాజానగరం, 2024 లో రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవెయ్యాలనే దృఢ సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్న రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ నేతృత్వంలో రాజానగరం మండలం పరిజల్లిపేట గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు చేపట్టిన ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేసారు. పూర్తి చేసిన డేటాను జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి పరిజల్లిపేట గ్రామ జనసేన నాయకులు అందజేయడం జరిగింది. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఓటర్ లిస్ట్ డేటాను పరిశీలించడం జరిగింది.