బాబుకు మద్దతుగా జనసేన

పాయకరావుపేట: తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు మద్దతుగా జనసేన ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో తెదేపా తోని కలిసి వెళ్తానంటూ ప్రకటన చేశారు. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ మాటే ప్రాణంగా బ్రతుకుతున్న అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జవ్వాది బద్రి పవన్ కళ్యాణ్ మాటే శాసనంగా తెదేపాకు మద్దతు పలుకుతూ శనివారం కోటవట్ల మండల కేంద్రంలో జరిగిన బాబుకు తోడుగా నేను సైతం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటవురట్ల మండలం తెదేపా మండల కమిటీ అధ్యక్షులు జానకి శ్రీను తోడుగా నేను ఉన్నానంటూ.. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నేను ఉన్నానంటూ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట తెదేపా ఇన్చార్జి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తో బద్రి చర్చిలు జరిపారు. పవన్ కళ్యాణ్ మాటే శాసనంగా నేను మీతో పాటు నడుస్తానంటూ మండల తెదేపా నాయకులు తో పాటు ఆమెకి కూడా హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో తెదేపాతో కలిసి కట్టుగా పనిచేయడానికి జనసేన మండల పార్టీ తరఫున ముందుకు వెళ్తానన్నారు. మంచి మనసున్న మనిషి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని, ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అక్రమ అరెస్టులు చూస్తున్నారని, అవన్నీ గమనించి జనసేన మద్దతు పలికిందన్నారు. వారితో పాటు కలిసి నడుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల కమిటీ అధ్యక్షులు జానకి శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశి నాయుడు, నాయకులు సుంకర బాబ్జి, సూర్యారావు, ప్రకాష్, నాని బాబు, సత్తిబాబు, తిరుమల రావు, గోవిందు, జనార్ధన్, భాస్కరరావు, నరేష్, లింగం నాయుడు తదితరులు పాల్గొన్నారు.