జగన్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది: గురాన అయ్యలు

విజయనగరం: జగన్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వుందని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు నేస్తం పథకానికి వైఎస్ఆర్ పేరు పెట్టడం సరికాదన్నారు.. కాపు జాతిలో ఎందరో మహనీయులు వున్నారని, ఎందుకు వారి పేర్లు గుర్తుకురావడం లేదని ప్రశ్నించారు. జగన్ ని అడిగే ధైర్యం వైకాపా కాపు ప్రజాప్రతినిధులకు లేదన్నారు. అవినీతి గురించి జగన్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరితోనైనా పొత్తు ఏర్పాటు చేసుకుంటారని, అడగడానికి జగన్, వైసిపి మంత్రులు ఎవరని ప్రశ్నిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు వైసిపి పాలనలో విసుకు చెందారని, ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని, 2024లో ప్రజలు తప్పక వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు. దుర్మార్గపు పాలనను అంతమందించాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏకం కావలసిన సమయం ఆసన్నమైనదన్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెలిపారు. అభద్రతా భావం తో జగన్, మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే, పోలీసులతో కేసులు పెట్టించినంతమాత్రాన, భయపడేది లేదన్నారు.