డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం 23వ వారం

  • ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం బారీవర్షంలో 23వ వారం కార్యక్రమాన్ని సాయిప్రియ సేవా సమితి వారిచే (61వ వారం) ఘనంగా నిర్వహణ.

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి పిఠాపురం నియోజకవర్గము జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటుచేసిన శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు గత 22 వారాలుగా ప్రతి శనివారం రైతులకు అన్నసదుపాయమును కల్పించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 23వ వారం ఈ శనివారం జనసేన నాయకులు, సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వయంగా 825 మంది రైతులకు,
పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్న సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రం నందు రైతులకు, పశువుల అమ్మకం మద్యవర్తులకు, హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులుఅల్లంకిషోర్, అల్లం శ్రీను, అందువరి రాజు, ఎద్దు రాజు, రవి, నక్కా మణికంఠ, బోత్సశ్రీకాంత్, పోట్టినురి గణేష్, ఇప్పర్తిశీను, జ్యోతులనాని, మేడిబొయిన హరికృష్ణ తదితరులు ఆహరం వడ్డనలో తమ సేవలను అందించారు. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్నపానీయసదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన దన్యవాదాలను తెలియజేయుచున్నానని జ్యోతుల శ్రీనివాసు ఒక ప్రకటనలో తెలియజేశారు.