110వ రోజుకు చేరుకున్న పవన్ అన్న ప్రజా బాట

  • పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే లక్ష్యం
  • రాజంపేట జనసేన నాయకులు

రాజంపేట నియోజకవర్గం: జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ మెలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు 110వ రోజు పవన్ అన్న ప్రజా బాట కార్యక్రమాన్ని టంగుటూరు టీవీ పురంలలో ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగినది అన్నారు. అక్కడ గ్రామ ప్రజలు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అలాగే జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తేనే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆ గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, వీరయ్య ఆచారి, పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య, జనసేన వీరమహిళలు జెడ్డా శిరీష, ప్రమీల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.