జగ్గూతండాలో సమస్యలను తీర్చాలని జనసేన డిమాండ్

తెలంగాణ, కొత్తగూడెం, పాల్వంచ మండలంలోని నవభారత్ దగ్గర జగ్గూతండాలో ఆదివారం కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్ ఆధ్వర్యంలో జనంకోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాల్వంచ మండలంలోని నవభారత్ దగ్గర జగ్గూతండాలో పర్యటించి రోడ్లు వీధి లైట్లు, మంచి నీటి సమస్య గురించి కొత్తగూడెం జనసేన ఇంచార్జి వేముల కార్తిక్ అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే తక్షణమే అధికార పార్టీ వాళ్ళు కే.సీ.ఆర్ ఇటీవల కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీకి ఇచ్చినవి 80 కోట్లలో నుంచి జగ్గూతండాకి కూడా కొంతడబ్బులు కేటాయించి వారి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం సోషల్ మీడియా ఇంచార్జి షైక్ బాషా, పాల్వంచ టౌన్ కమిటీ సభ్యులు శివ, రూపేష్, దినేష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.