జనసేన ఆధ్వర్యంలో గాంధీ జయంతి- స్వచ్చ భారత్

అమలాపురం: జనసేన రాష్ట్ర నాయకులు డి.ఎమ్.అర్ శేఖర్ ఆధ్వర్యంలో సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా గడియారస్థంభం సెంటర్లో గాంధీ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమలాపురంపట్టణ నల్ల వంతెన నుండి ఎర్రవంతెన మధ్యలో ఉన్న కాటన్ పార్క్ నందు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య ముఖ్య అతిధిగా స్వచ్ఛభారత్ లో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఫాల్గొన్నారు.