అహ్మదాబాద్‌ కోవిడ్19 ఆసుపత్రిలో బారీ అగ్ని ప్రమాదం

గుజరాత్‌ రాష్ట్రంలో అహ్మదాబాద్‌లోని నవరంగపుర కోవిడ్19 ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలో గురువారం వేకువజామున ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురికి కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో ఉన్నవారు ప్రాణభయంతో భయటకు పరుగులు తీశారని స్థానికులు చెబుతున్నారు.