మహిళా నేత పార్వతమ్మకు లోకం మాధవి భరోసా
నెల్లిమర్ల: డెంకాడ మండలం సింగవరం గ్రామంలో వైసీపీ నుంచి జనసేన పార్టీ లోకి ఇటీవలే జాయిన్ అయిన మహిళా నేత పార్వతమ్మను గ్రామంలో గల కొందరు వైసీపీ నేతలు బెదిరించటం జరిగింది. అయితే విషయం తెలుసుకున్న శ్రీమతి లోకం మాధవి ఆవిడ స్వగృహం నందు కలిసి ఆమెకు అన్నివిధాల తాను అండగా ఉంటానని ఆమెకు భరోసాను ఇచ్చారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-5.36.22-PM-1024x473.jpeg)