జనసేన జనచైతన్య యాత్ర – భారీ బైక్ ర్యాలీ

ఎల్ బి నగర్ నియోజకవర్గం, వనస్థలిపురం డివిజన్లో జనచైతన్య యాత్ర మూడవ విడత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన సిద్ధాంతాలను మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ఎల్ బి నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి సాయి శిరీష పొన్నూరు ఇంటింటికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా శ్రీమతి సాయి శిరీష పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలను ప్రజల నుంచి తెలుసుకుంటూ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగించటం జరిగింది. మూడవ రోజు ఆదివారం పెద్దఎత్తున జనసేన నాయకులు మరియు జనసైనికులచే భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలనుండి అశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సాయి శిరీష ధన్యవాదాలు తెలుపుతూ ముందు ముందు ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేయబోయే కార్యక్రమాలకు అందరూ కూడా ఉత్సాహంగా రావాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపారు.