టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పాదయాత్రకి జనసేన మద్దతు

పెనుకొండ: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పాదయాత్రకి మద్దతుగా గోరంట్ల నుంచి భారీ ఎత్తున తరలివెళ్లిన గోరంట్ల జనసేన నాయకులు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి నిరసనగా సోమవారం పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పెనుకొండలో పాదయాత్రకి మద్దతుగా నేడు గోరంట్ల నుంచి జనసేన పార్టీ నాయకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తూ తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, మండల అధ్యక్షుడు సంతోష్, కార్యక్రమల కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, నియోజకవర్గ నాయకుడు అనిల్, మండల నాయకులు నరేష్, నాగేష్, శ్రీనివాసులు, బాబావలి, రాఘవేంద్ర, తిరుపల్, మూర్తి, వసీం, బాలు, శ్రీకాంత్, మురళి తదితరులు పాల్గొన్నారు.