చంద్రబాబుకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ

మదనపల్లి: నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అయన మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం, మదనపల్లె పట్టణం నందు నిమ్మనపల్లి సర్కిల్ నుండి బెంగళూరు బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున మహిళలతో కొవ్వొత్తుల ర్యాలీ మరియు కాగడాల ప్రదర్శన భారీగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహిళలతోపాటు ర్యాలీలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ దొమ్మలపాటి రమేష్, జనసేన పార్టీ నాయకులు రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి రాటకొండ మధుబాబు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాం చినబాబు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, సీనియర్ మహిళా నాయకులు మల్లిక, రూప, మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు తులసీ శ్రీనివాసులు, ఆకుల శంకర, శ్రీనివాసులు, అశోక్ కుమార్, ఆకుల శంకర, ధరణి, చలపతి, మల్లికార్జున, శివప్రసాద్, మదనపల్లి జనసేన నాయకులు పవర్ ఆఫ్ ది టీం అధ్యక్షులు గోపాలకృష్ణ, రామిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.