ఘనంగా ప్రారంభమైన దసరా మహోత్సవ్ మెగా క్రికెట్ టోర్నమెంట్
రాజానగరం: రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో ఆదివారం ఘనంగా దసరా మహోత్సవ్ మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమైనాయి.
రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అభివాదం చేసి పోటీలలో చక్కటి ప్రతిభ కనబరచాలని ప్రతీ ఒక్కరికీ అల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ యువతలో చైతన్యం నింపడానికి, శారీరక దృఢత్వానికి, మానసిక ఉత్తేజానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో తోడ్పడతాయని.. ప్రతీ ఒక్కరు తమ యొక్క ప్రతిభను కనబరిచడానికి ఇదొక చక్కటి అవకాశమని ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తోకాడ గ్రామ జనసేన నాయకులు, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-15-at-4.12.43-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-15-at-4.12.43-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-15-at-4.12.44-PM-1024x576.jpeg)