ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడిన పెంటేల బాలాజీ

చిలకలూరిపేట, ఆదివారం జనసేన నియోజకవర్గ నాయకులు పెంటేల బాలాజీ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలో పుట్టి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో కుటుంబ విషయాలను చర్చించడం అసభ్యకరంగా ఉందని స్త్రీలను పిల్లల్ని అడ్డం పెట్టుకొని అవినీతి రాజకీయం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత కక్షలను పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసారు. ప్రభుత్వ ఉద్యోగులను, నిరుద్యోగ యువతను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేశారు. స్థాయిని మర్చిపోయి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆరోపించారు. ప్రభుత్వ టీచర్ల సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చి మడెం తిప్పారు. రాజధాని నిర్మిస్తానని రాజధాని ఎక్కడ పెట్టాలో తెలీక ఇప్పటివరకు ప్రజలను భ్రమలోనే ఉంచారు. మచ్చలేని మా నాయకుడు పవన్ కళ్యాణ్ మీ అవినీతి ప్రశ్నిస్తున్నారని వాటికి సమాధానం చెప్పలేక పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితం వారి కుటుంబ సభ్యులను సభల్లో దూషించడం ఖండించారు, ప్రజలు జగన్ మీద ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయారని మరలా ప్రజలు తమ ఓటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడ్ని ఎన్నుకుంటారు. ఆ సమయం ఎంతో దూరం లేదని అన్నారు.