సి.సి రోడ్ల కు శంకుస్థాపన చేసిన డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మల్కిపురం మండలం, చింతలమోరి గ్రామంలో బోణం వారి వీధి, నల్లి వారి గ్రూపు ల నందు నూతనంగా ప్రారంభిస్తున్న సి.సి రోడ్ల కు శంకుస్థాపన చేసిన రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు, చింతలమోరి సర్పంచ్ డాక్టర్ రమేష్ బాబు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీత, స్థానిక ఎంపీటీసీ తోటే రాజేష్, జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగురి మనోహర్, జనసేన పార్టీ మండల కార్యదర్శి పొన్నామండ సత్యనారాయణ, రాలి శ్రీను, స వార్డ్ మెంబర్లు పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొనడం జరిగింది.