విజయవాడలో వాలంటీర్ల ఆందోళనలో ఉద్రిక్తత

వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ విజయవాడలో సచివాలయ వాలంటీర్లు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వలంటీర్లు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వేలాది మంది వాలంటీర్లు రావడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమకు రూ.10 వేల జీతం, ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రోడ్లన్నీ వాలంటీర్లతో నిండిపోయాయి.