దసరా ఉత్సవాలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ దసరా శరన్నవరాత్రి మహోత్సవలలో భాగంగా ఐ.పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో బాణాల బ్రదర్స్ వారి శ్రీ విజయదుర్గ అమ్మవారి పీఠంను దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఐ.పోలవరం మండలం పశువుల్లంక రామాలయం సెంటర్ నందు, పశువుల్లంక గ్రామంలో, ముమ్మిడివరం మండలం తానెల్లంక గ్రామం దేవి సెంటర్, కాట్రేనికోన మండలం దొంతికుర్రు గ్రామంలోగల అమ్మవార్లను దర్శించి, ఆశీస్సులు పొంది అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు
వీరివెంట సానబోయిన మల్లికార్జునరావు, మద్దింశెట్టి పురుషోత్తం, మోకా బాలప్రసాద్, కొప్పిశెట్టి గణేష్, పితాని రాజు, సలాది రాజా వాసంశెట్టి బాబ్జి, కుడిపూడి కుమార్, విత్తనాల అర్జున్, పితాని శివ, సంసాని పాండురంగారావు, బళ్ళ కుమార్, బొక్కా శ్రీను, కడలి నాగేశ్వరరావు, శీలం శ్రీను, శీలం వసంతరావు మొదలగు వారు పాల్గొన్నారు.