జనసేనలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త లోళ్ల రాజేష్

శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కళ్యాణి గ్రూప్స్ అధినేత లోళ్ల రాజేష్ శనివారం పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయన్ను నాదెండ్ల మనోహర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పోలవరం నియోజకవర్గం నుంచి….
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వైసీపీకి చెందిన నాయకులు చోడిపిండి సుబ్రహ్మణ్యం, గొలిశెట్టి సూర్యచంద్రరావు, ఆరేటి బులి వెంకట్రామయ్య, కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పన ప్రసాద్, బైపీ పుల్లారావు, ఏపీ టైలర్స్ వర్కర్స్ స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ సీహెచ్. మధుబాబుతో పాటు మరికొందరు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. జిల్లా ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు, పోలవరం ఇంఛార్జి చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో వీరంతా జనసేన కండువా కప్పుకున్నారు. వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్ అంతా కలసికట్టుగా పార్టీ బలోపేతానికి, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేయాలని సూచించారు.