“నిజం గెలవాలి” కార్యక్రమానికి కుప్పం జనసేన మద్దతు

కుప్పం, నిజం గెలవాలిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులందరూ శుక్రవారం నారావారి పల్లెలో శ్రీమతి భువనేశ్వరిని కలిసి మద్ధతు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాధ్యక్షులతో పాటు, ఉమ్మడి జిల్లా కార్యదర్శి రామమూర్తి, సంయుక్త కార్యదర్శి మునెప్ప, రాష్ట్ర మత్స్యకార కార్యవర్గ సభ్యులు వామనమూర్తి మండల అధ్యక్షులు హరీశ్, కిషోర్, అమీర్, నాయకులు మంజునాథ్ మరియు కృష్ణమూర్తి పాల్గొనడం జరిగింది.