జనసైనికుడు అలెక్స్ కుటుంబానికి అండగా నిలచిన జనసేన నాయకులు

వట్టిచెరుకూరు మండలం, ముట్లూరు గ్రామానికి చెందిన జనసైనికుడు నక్కా అలెక్స్ సోమవారం కరెంటు షాక్ తో మృతి చెందడం జరిగింది. మంగళవారం అలెక్స్ అంత్యక్రియలలో భాగంగా అంత్యక్రియల కోసం ముట్లూరు గ్రామ జనసేన పార్టీ తరుపున అలెక్స్ కుటుంబ సభ్యులకు 20,000/- రూపాయలను వట్టిచెరుకూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ప్రత్తి బావన్నారాయణ, ముట్లూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కోటికం వెంకటేశ్వరరావు మరియు జనసైనికులు అందచేశారు.