పాలచర్ల గ్రామంలో రెండవ రోజు “జనంకోసం జనసేన మహాపాదయాత్ర”

రాజానగరం, రాజానగరం మండలం, పాలచర్ల గ్రామంలో సోమవారం రెండవ రోజు జనంకోసం జనసేన మహాపాదయాత్ర దృతంగా కొనసాగడం జరిగింది. ఈ పాదయాత్రలో భాగంగా అడుగడుగునా హారతులు ఇస్తూ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి పాలచర్ల గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలికడం జరిగింది. గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కష్ట సుఖాలను తెలుసుకుంటూ 2024లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ లను బత్తుల వెంకటలక్ష్మి అందజేయడం జరిగింది. ఈ పాదయాత్రలో బత్తుల వెంకటలక్ష్మి వెంట జనసేన నాయకులు, జనసేన శ్రేణులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.