ముమ్మిడివారి పాడు నందు దుర్గామాత అమ్మవారి అన్నసంతర్పణలో డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం ముమ్మిడివారి పాడు నందు ఏర్పాటు చేసినటువంటి దుర్గామాత అమ్మవారి అన్నసంతర్పణ కార్యక్రమానికి కమిటీ వారి ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా(ఎం.డి జెనరల్ మెడిసిన్) అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి అన్నసంతర్పణ కార్యక్రమం నిమిత్తం 5116/- రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముమ్మిడి గంగ సత్యనారాయణ, ముమ్మిడి రమేష్, తైల పాండవ కృష్ణ, మొగలి రాంబాబు, ఏరికిరెడ్డి బుజ్జిబాబు, తైల ఏడుకొండలు, బండి వీరబాబు మరియు జనసైనికులు గ్రామ పెద్దలు కమిటీ వారు పాల్గొనడం జరిగింది.