జనసేన, టిడిపి ఉమ్మడి కార్యచరణ సమన్వయ కమిటీ సమావేశం

నూజివీడు నియోజకవర్గం: నూజివీడు టీడీపీ ఇంచార్జీ ముద్దరబోయిన వెంకటేశ్వరరావును శనివారం నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. రాబోయే రోజుల్లో నూజివీడు నియోజకవర్గంలో జనసేన-టీడీపి కలిసి ఉమ్మడి కార్యచరణ మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అలానే వచ్చే వారంలో ఇరు పార్టీల ముఖ్యనాయకులతో సమన్వయ కమిటీ సమావేశాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు జనసేన నాయకులు తోట వెంకట్రావు, పాశం నాగబాబు, సురిసెట్టి శివ, ఏనుగుల చక్రి, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు గొంగాడ ఉమా, రావి మహేష్, గొల్లపల్లి శ్రీకాంత్, గిరి, పసుపులేటి బంగారయ్య, యాదల వెంకట్, పాదం శివకృష్ణ, జక్కుల మురళి, మండల శివ, చింత స్వామి, పోతుల సాయి తదితరులు పాల్గొన్నారు.