నరసాపురంలో జనసేన విస్తృత స్థాయి సమావేశం

నరసాపురం: నరసాపురం నియోజకవర్గ జనసేన కార్యాలయంలో శనివారం నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ఓటు నమోదుల పట్ల అప్రమత్తంగా ఉండి కొత్త ఓట్లను దగ్గర ఉంది నమోదు చేయించి ఆ ఓటర్లను ప్రభావితం చెయ్యాలని తెలియజేశారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుని రాబోయే రోజుల్లో అధికార దిశగా ముందుకు సాగాలి అని అన్నారు. జనసేన – టీడీపీ పొత్తును ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లి ప్రజలను ప్రభావితం చేయాలి అని కోరారు. ఈ సమావేశానికి నరసాపురం పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, వర్ధనపు ప్రసాద్, మాధంశెట్టి కోటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గంటా కృష్ణ, నిప్పులేటి తారకరామారావు, బొమ్మిడి సునీల్, కోపల్లి శ్రీనివాస్, బొమ్మిడి కృష్ణమూర్తి, పెమ్మాడి కిరణ్, వట్టిప్రోలు సతీష్, వాతాడి రమేష్, పోలిశెట్టి సాంబ, కొల్లాబత్తుల వెంకటేశ్వరారావు, బళ్ల హనుమంతు, అందే దొరబాబు, పులపర్తి రాంబాబు, కొట్టు రామాంజనేయులు, పేరుపాలెం వెంకన్న, తోట అరుణ, భారతి సురేష్, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, పిప్పళ్ళ సుప్రజ, వలవల సావిత్రి, లక్కు బాబి, ఉప్పులూరి రాంబాబు, పసుపులేటి అభి, గణేశ్న శ్రీరామ్ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.