ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన-టీడీపీల ఆత్మీయ సమావేశం

ఎచ్చెర్ల నియోజకవర్గం: రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు జనసేన -టీడీపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో మరియు భవిష్యత్తు కార్యాచరణఫై ఎచ్చెర్ల నియోజకవర్గం ఉబయ పార్టీల నాయకులతో ఆత్మీయ సమావేశం, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, జనసేన సమన్వయకర్త డా విష్వక్సేన్, ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి్ మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు, జనసేన మండల అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి, దుర్గారావు, మీసాల రవి కుమార్, శ్రీనివాస్ రావు, టీడీపీ మండల అధ్యక్షులు, నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణఫై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సమన్వయ సభ్యులు శ్రీమతి పాలవలస యశస్విని, టీడీపీ నాయకులు రాంమల్లిక్ నాయుడు, జనసేన నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, బలరాం, గొర్లె సూర్య, అర్జున్ భూపతి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.