సిరిగలపల్లిలంక గ్రామ ప్రజల ఆదరణ అపూర్వం – పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలంలోని సిరిగలపల్లిలంక గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి 14వ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నందుకు ఆనందంతో అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ నిరంకుశత్వ పరిపాలన పోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ,ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.