రంపచోడవరంలో జనసేన-టీడీపీ సమన్వయ సమావేశం
రంపచోడవరం నియోజకవర్గం: నియోజకవర్గ జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణతో ఎలా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనుల్ని జనంలోకి బలంగా ముందుకు తీసుకువెళ్లాలి ఉమ్మడి మేనిఫెస్టో ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలి, మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆలోచనా విధానం కూడా జనంలోకి తీసుకువెళ్లాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మది కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, రంపచోడవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా లీగల్ ఉపాధ్యక్షులు సెల్ కాకి స్వామి, రాజవొమ్మంగి బొద్దిరెడ్డి త్రిమూర్తులు, అడ్డతీగల కుప్పాల జయరాం, గంగవరం కుంజం సిద్దు,
దేవీపట్నం రాయుడు, మారేడుమిల్లి దుర్గాప్రసాద్, చింతూరు రాజు, ఎటపాక గంగాధర్, కూనవరం సాయి కృష్ణ, వి ఆర్ పురం నరేందర్, జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్లు నాయకులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-16-at-10.01.59-PM.jpeg)