బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి: బొమ్మిడి నాయకర్

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి దాదాపు 60 బోట్లకు ప్రమాదం జరిగింది. ఒక్కొక్క బోటు విలువ సుమారుగా 40 నుంచి 50 లక్షలు. దాదాపు 40 కోట్లకు పైగా ఆస్థి నష్టం జరిగింది. మత్స్యకారులు వారి జీవనోపాధి కోల్పోయారు. విషయం తెలుసుకుని తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ మరియు రాష్ట్ర జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని తెలియజేశారు. ఉపాధి కోల్పోయిన అందరికీ జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.