రామాలయ నిర్మాణానికి బర్మా ఫణి బాబు విరాళం

నూజీవీడు నియోజకవర్గం: ముసునూరు మండలం, చెక్కపల్లి గ్రామంలో కార్యకర్తల సమావేశం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సంప్రదింపుల సమన్వయకర్త బర్మా ఫణి బాబు రామాలయంలో స్వామి వారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ వారికి 5,116 రూపాయిల విరాళం అందచేశారు. ఈ సందర్బంగా బర్మా ఫణి బాబు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో వచ్చేది ఉమ్మడి జనసేన-టిడిపి ప్రభుత్వం అని, ప్రజలు వైసిపిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినారు. ఈ కార్యక్రమంలో బర్మా ఫణి బాబుతో పాటు రామాలయ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు పాశం నాగబాబు, తోటవెంకట్రావు, ఏనుగులచక్రీ, సూరీశెట్టి శివ, గొల్లపల్లి శ్రీకాంత్, తోట సత్యం, శ్రీధర్, మారుతి, రవి, శ్రీను, సతీష్, వెంకట్, కడియం శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.