సిద్ధి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో మంగళవారంనాడు జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్‌ నుంచి ఈ మొత్తాన్ని అందజేస్తారని పీఎంఓ ఒక ట్వీట్‌లో తెలిపింది. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50,000 చొప్పున సాయం అందజేయనున్నట్టు తెలిపారు. బస్సు కాలువలోకి దూసుకువెళ్లిన ప్రమాదంలో 39 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణిస్తున్నారు. ఇంతవరకూ 39 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. ఏడుగురిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. తక్కిన వారి కోసం గాలిస్తున్నారు. క్రేన్లతో బస్సు వెలికి తీస్తున్నారు.