కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమం గురువారం కృషుడి గుడి సెంటర్ వద్ద అగ్రహారం సతీష్ ఆధ్వర్యంలోను నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా జనసేన శ్రేణులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్ల గారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. అసలు ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వాన్ని నడుపుతూ ఆసొమ్ముతోనే ప్రజా సంక్ష్యేమ పధకాలను అమలు చేస్తున్న ఈ వై.సి.పి ప్రభుత్వం తామేదొ జనాన్ని ఉద్ధరించేస్తున్నట్టు సొకులుపోడం ఏంటో అర్ధం కాడంలేదనీ, పొనీ వాటినైనా సక్రమంగా అమలు చేస్తున్నారా అంటే దేని గురించి ఆరాతీసినా అవినీతి కంపు బయటపడుతోందన్నారు. అసలు ఈ వై.సి.పి ప్రభుత్వానికీ, నాయకులకీ అవినీతి అన్నది ఇంటిపేరు అయిపొయిందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఈ వై.సి.పి చేసే అసత్యప్రచారాన్ని, అవినీతిని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా తిప్పికొడతామని ప్రజలు తమకు మద్దతు తెలపమని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.