సూర్యనారాయణపురంలో ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ: తారీఖున జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో 31 వ డివిజన్లో సూర్యనారాయణపురం ప్రాంతంలో గురువారం జనసేన పార్టీ ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ యాత్రలో జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ.. దేశ సేవలో అనేక మంది ముస్లిం సోదరులు మమేకమై ఉన్నారన్నారు. దేశాన్ని అంతరిక్ష రంగంలోనే కాక క్షిపణి తయారీలో సైతం తన విఙ్ఞ్యానాన్ని అందించి తలయెత్తుకునేలా చేసిన డా. అబ్దుల్ కలాం గారి సేవలు ఇందుకు నిదర్సనం అని కొనియాడారు. కానీ నేటి ఈ వై.సి.పి ప్రభుత్వం పాలనలో నిరాదరణకు ముస్లిం సమాజం గురవుతోందని విచారం వ్యక్తం చేసారు. ముస్లిం సోదరులకు కొద్దిపాటి చేయూతనిస్తే అసాధారణమైన ఫలితాలను సాధించగలరని అందుకు తగిన చర్యలని చేపట్టాలని వై.సి.పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. తమ జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో చేసేదే చెప్పబోతున్నామనీ అది రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చాకా చేసి నిరూపిస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మొయినుద్దీన్, ఇస్మాయిల్, షరీఫ్, హాబీబుల్లా, బషీర్, రహీం ఖాన్, బాజీ, సుల్తానా, రజియా, బేగం తదితరులు పాల్గొన్నారు.