ఓటు నమోదు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం

గజపతినగరం నియోజకవర్గం: గజపతినగరంలో శ్రీకృష్ణ డిగ్రీ కళాశాలలో శనివారం ఓటు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం మండల అధ్యక్షులు మునకాల జగన్నాధరావు మరియు కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు, సిబ్బంది నారాయణరావు కొత్త ఓటు నమోదు చేస్కున్న విద్యార్థులు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్ధి ఓటు నమోదు చేయించుకోవాలని తెలిపారు. మీ గ్రామంలో బి.ఎల్.ఓని సంప్రదించాలని కోరడం జరిగింది.