Nuzvid: మానవతా దృష్టితో పోటీ విరమించుకున్న జనసేన

నూజివీడు మున్సిపాలిటీ పరిధిలో 27వ వార్డ్ కు జరగనున్న బై ఎలక్షన్ కు వైసీపీ పార్టీ వారు టికెట్ ఎవరిస్తారో గోప్యంగా ఉంచడం వలన పోటీ అనివార్యం అనుకుని జనసేనపార్టీ అభ్యర్దిగా ముమ్మలనేని సునీల్ కుమార్ 27వ వార్డ్ కౌన్సిలరుగా నామినేషన్ వేయడం జరిగింది. వైసీపీ పార్టీ చివరికి చనిపోయిన వ్యక్తి భార్యకే టిక్కెట్ ఇవ్వడంతో మానవతా దృష్టితో గత సంప్రదాయం పాటిస్తు పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకుని పోటీ నుండి విరమించుకోవడం జరిగింది. అందరూ అన్ని పార్టీలు ఏకగ్రీవం కొరకు చేయాలని అభ్యర్థనను మన్నించి అందరి అభిప్రాయం తీసుకుని విరమించుకోవడం జరిగిందని ముమ్మలనేని సునీల్ కుమార్ తెలిపారు. ఈ కర్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.