వీధి దీపాలు ఏర్పాటు చేయాలని రాజాం జనసేన వినతి
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం బుచ్చంపేట విద్యుత్ దీపాల కోసం రాజాం నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ ని కలిసిన జనసేన నాయకులు. జి.సి.ఎస్.ఆర్ కాలేజ్ నుండి బుచ్చంపేట గ్రామం వరకు వీధి దీపాల కోసం రాజాం పట్టణ కమిషనర్ కి రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ ఎన్ని రాజు వినతిపత్రం అందజేయడం జరిగింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించిన కమిషనర్. బుచ్చంపేట గ్రామం తరపున ఎన్ని రాజుకి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎన్ని రాజు, బుచ్చంపేట జనసేన పార్టీ నాయకులు నమ్మి దుర్గారావు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-18.56.44-1024x462.jpeg)