రోశయ్యకు నివాళులర్పించిన జనసేన నాయకులు

కాకినాడ సిటిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పి.ఏ.సి సబ్యులు ముత్తా శశిధర్ సూచనల మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ శ్రేణులు ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవంతో దశాబ్దాల కాలంపాటు ఆయన రాష్ట్రానికి సేవలు చేసారన్నారు. ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు సైతం ఆయన సలహాలను మన్నించేవారనీ, అస్సెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే ఆసక్తిగా సభ్యులే కాదు టి.వి లలో ప్రజలు సైతం వినేవారన్నారు. శాసనసభలో ఎక్కువసార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన మంత్రిగా ఆయనను ప్రజలు మరువలేరనీ ఆయన హుందాతనం విలువలని అందరూ పాటిస్తామని అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మనోహర్ లాల్ గుప్తా, సుంకర సురేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.