నారా లోకేష్ కి సంఘీభావం తెలిపిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జ్యోతుల శ్రీనివాసు
పిఠాపురం నియోజకవర్గం: యువగళం పాదయాత్ర 3వ రోజు కార్యక్రమాన్ని సోమవారం ఉప్పాడ కొత్తపలి మండలం, మూలపేట గ్రామం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా యువగళం యాత్రకు జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, ఇతర జనసేన నాయకులు, జనసైనికులు కలిసి నారాలోకేష్ ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. ముందుగా నారా లోకేష్ ను కలిసి జనసేన ఇంచార్జ్ తంగెళ్ళ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎస్వీఎస్ వర్మ, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పాదయాత్రను చేసి తగు మద్దతుని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీనాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు వీరమహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-6.37.29-PM-1024x459.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-04-at-6.37.30-PM-1024x682.jpeg)