తీవ్ర తుపానుముంచుకొస్తోంది- అప్రమత్తత అవశ్యం

రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను తీవ్ర ప్రభావం చూపించబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో కోరారు. ఇది తీవ్ర తుపాను అని రెడ్ అలెర్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలి. తుపాను ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయక చర్యల్లో జనసేన నాయకులు, శ్రేణులు పాలుపంచుకోవాలి. ఆహారం, ఔషధాలు అందించాలి. క్షేత్ర స్థాయిలో తుపాను నష్టాన్ని కూడా అంచనా వేయాలని పార్టీ నేతలకు సూచిస్తున్నాను. పంటలు చేతికి వచ్చే సమయం ఇది. పంటలు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతాంగం కుదేలైపోతోంది. పంట నష్ట పరిహారాన్ని లెక్కించడంలో మానవతా దృక్పథంతో అధికారులు వ్యవహరించాలని జనసేనాని సూచించారు.