కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న అతికారి దినేష్

రాజంపేట కూరగాయల మార్కెట్ లో రాజంపేట జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అతికారి దినేష్ మంగళవారం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా అతికారి దినేష్ మార్కెట్ వ్యాపారస్తులు మరియు ప్రజలతో మాట్లాడి వారి కష్టనష్టాలను తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వర్షపు నీరు చేరి మార్కెట్ మొత్తం బురదమయం అయ్యి మార్కెట్లో సరైన డంపింగ్ యార్డ్ లేనందువలన కుళ్ళిపోయిన కూరగాయల చెత్తాచెదారం వలన కలిగే దుర్వాసన రావడంతో అనారోగ్యానికి గురవుతున్న మార్కెట్ వ్యాపారస్తులు మరియు స్థానిక నిర్వాసితులు ఈ విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వారికి అండగా ఉంటామని ఈ సమస్యలన్నిటిని అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని ప్రతి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వ్యాపారస్తులు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.