మక్కెనవారిపాలెంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

దర్శి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు ముండ్లమూరు మండలంలోని మక్కెనవారిపాలెంలో ముండ్లమూరు మండల కమిటీ ఉప అధ్యక్షులు అంచుల వీరాంజనేయులు మరియు ప్రధాన కార్యదర్శి నాము నాగేంద్రల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలలో జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొటుకు రమేష్ బాబు మరియు ముండ్లమూరు మండల కమిటీ ఉప అధ్యక్షులు నాగమల్లి దానమూర్తి ల పాల్గొన్నారు. జనసైనికులు టపాసులు కాల్చి సంబరాలు చేశారు. రమేష్ బాబు కేకును కట్ చేసి జనసైనికులకు తినిపించారు. తదనంతరం గ్రామ జనసైనికులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల నాయకులు పుప్పాల పాపారావు, పాపిశెట్టి ఏడుకొండలు, పాలంకి ఏడుకొండలు, వీర మహిళా నాయకురాలు శ్రీమతి గుండ్ల భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మక్కెనవారిపాలెం గ్రామ జనసైనికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.