దొంతమూరు గ్రామంలో వరద బాధితులకు అండగా నిలబడిన జనసైనికులు

పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పిఠాపురం మండలం పి. దొంతమూరు గ్రామంలో పి.ఎస్.ఎన్.మూర్తి టీం పర్యటించి వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన పార్టీ. పి ఎస్ ఎన్ మూర్తి హరిబాబు వారి ఆధ్వర్యంలో 15 కుటుంబాలకి నూనె ప్యాకెట్లు, 5 కేజీల రైస్ ఇవ్వటం జరిగింది. వరద బాధితులు మమ్మల్ని ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదని, జనసేన పార్టీ మాకు అండగా ఉందని, మాకు చాలా సంతోషంగా ఉంది అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, పెంకే పెంకె జగదీష్, కోలా దుర్గాదేవి, పిల్లా రమ్యజ్యోతి, కె నాగేశ్వరావు, పి. భీమేశ్వరావు, తోట సతీష్ పబ్బిరెడ్డి దుర్గా ప్రసాద్, నామ శ్రీకాంత్, పి.ఎస్.ఎన్.మూర్తి, పి.దొంతమూరు జనసేన నాయకులు కర్రి హరిబాబు, చింతల శశి, పల్లా సందీప్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, చక్రవర్తుల దన, చక్రవర్తుల స్వామి, గుండే రాజు, బండి శ్రీను, వాసంశెట్టి రాము, దిబ్బిడి రాజు, కొత్త రాజు, బల్లపాటి స్వామి తదితరులు పాల్గొన్నారు.