తాడిపత్రి జనసేన ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్

అనంతపురం జిల్లా, తాడిపత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ దేశాల మేరకు #GoodMorningCMSir డిజిటల్ కాంపెయిన్ లో భాగంగా చేపట్టిన 15/08/2022 నుంచి1 7/07/2022 వరకు వరుసగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కుందుర్తి నరసింహాచారి మరియు రాష్ట్రచిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు ఆటో ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రోడ్ల నిర్మాణం అనేది పూర్తిగా మన ప్రభుత్వం విస్మరించి కేవలం ఓటుబ్యాంకు కోసం మాత్రమే రాష్ట్రాన్ని గుల్ల చేసే సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, అందుకోసం పూర్తిగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నారు, 6100 కి.మి. రోడ్ల నిర్మాణం కోసం ₹2000 కోట్ల రూపాయలను అప్పు చేసి రోడ్లు వేయకుండా ఆ నిధులను దారి మళ్లించారని జనసేన పార్టీ నాయకులు కుందుర్తి నరసింహాచారి విమర్శించారు. ఇందులో జనసేనపార్టీ జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు అచుకాట్ల అల్తఫ్ఫ్, మాధునేను గోపాల్, జనసైనికులు షేక్ ఇమామ్ వలి, షేక్ సాధక్ వలి, శివకుమార్ రెడ్డి, పెద్దిరాజు, విజయ్, శివ, సాయి, పవన్ కళ్యాణ్, అమీర్, అంజి, మాలిక్, హుస్సేన్, సోము, భరత్, మస్థాన్, అక్రమ్, ధను శేఖర్, అనిల్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.