తోకాడ గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర
- రాజానగరం నియోజకవర్గంలో బత్తులకు బ్రహ్మరథం
రాజానగరం: రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో ఆదివారం జనం కోసం జనసేన మహాపాదయాత్ర ఉదృతంగా కొనసాగింది. జనసేన పార్టీ అభ్యర్థి, రాజానగరం నియోజకవర్గ స్థానిక వాస్తవ్యులు బత్తుల బలరామకృష్ణ కు నియోజకవర్గంలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జనంకోసం జనసేన మహా పాదయాత్రలో భాగంగా శ్రీమతి ప్రత్యూష దేవి, బత్తుల వందనాంబిక తోకాడ గ్రామంలో పర్యటించారు. వీరిని గ్రామంలోని ప్రజలు అడుగడుగునా హారతులు పడుతూ పూల వర్షాలతో ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర ప్రజల్లో జనసేన పట్ల ముఖ్యంగా బత్తుల బలరామకృష్ణ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం, ఈ కుటుంబం మీద ఉన్న గౌరవం కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే పట్ల అతని అవినీతి, నిరంకుశ ధోరణి, నిర్లక్ష్య వైఖరి పట్ల జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఈ ఐదు సంవత్సరాలలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి చేసిన దుర్మార్గాలను కథలు కథలుగా చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తోకాడ గ్రామంలో గడపగడపకు వెళుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం ఆవశ్యకతను వివరించడం జరిగింది. గ్రామంలో కొందరు జనం తమ గ్రామ యువతను పెడదారిన పెట్టిస్తున్న జక్కంపూడి కుటుంబం గురించి గోడు వెల్లబోసుకున్నారు. దీనికి స్పందిస్తూ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ గెలిచిన వెంటనే నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ గాని, డ్రగ్స్ దందా చేసే వారిని గానీ ఏరివేస్తానని, యువతను విద్య వైపు, ఉపాధి అవకాశాలను సృష్టించి సరైన జీవనం వైపు మరలేలా చేస్తానని మాట ఇచ్చారు. యువతకు పెడదోవ పట్టిస్తున్న నాయకులకు గుణపాఠం నేర్పుతామని తెలిపారు. జనం గురి అంతా బత్తుల వైపు ఉండడం వారి సిద్ధాంతాల పట్ల ఆకర్షింపబడటం వల్ల గ్రామం మొత్తం బత్తుల కుటుంబ సభ్యుల మహాపాదయాత్రను దిగ్విజయం చేస్తూ జై బత్తుల జై జనసేన జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో హోరెత్తించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-10-at-11.58.54-AM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-10-at-11.58.55-AM-1024x576.jpeg)