అరకు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అరకు నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం అరకు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు బంగారు రామదాసు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు క్రియాశీల సభ్యత్వం కిట్లు పంపిణీ చేస్తూ అరకు నియోజకవర్గం నాయకుడు బంగారు రాందాస్ మాట్లాడుతూ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అరకు నియోజకవర్గంలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే జనసేన పార్టీ 5 లక్షల వరకు ఈ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు అందించడం జరుగుతుందని, జనసేన పార్టీ సభ్యుడుగా ఉన్న ప్రతి ఒక జనసైనికుడి కుటుంబం భరోసా కొరకు జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని బంగారు రామదాసు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు బి ముత్యాల నాయుడు, దిలీప్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.